తెలంగాణ, వరంగల్. 12 జూన్ (హి.స.)
ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తున్నామని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా దాత కుల్ల యాకాంతం అందజేసిన పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్, టై,బెల్ట్ లను కలెక్టర్ గురువారం విద్యార్థులకు అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను బోధించే టాలెంటెడ్ ఉపాధ్యాయులు ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఎం.ఈ.ఓ శ్రీధర్, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు