ఓ వైకాపా.యువ నాయకుడు గుడిని. చెర బట్టాడు
అమరావతి, 12 జూన్ (హి.స.) తర్లుపాడు : ఓ వైకాపా యువ నాయకుడు గుడిని చెర బట్టాడు. వందల ఏళ్ల నుంచి ఉన్న అనంతరాయుడి భూములతో పాటు ఆలయాన్ని కబ్జా చేసినా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. తర్లుపాడు మండలంలోని ఉమ్మారెడ్డిపల్లె, తాడివారిపల్లె, నాగెళ్లముడు
ఓ వైకాపా.యువ నాయకుడు గుడిని. చెర బట్టాడు


అమరావతి, 12 జూన్ (హి.స.)

తర్లుపాడు : ఓ వైకాపా యువ నాయకుడు గుడిని చెర బట్టాడు. వందల ఏళ్ల నుంచి ఉన్న అనంతరాయుడి భూములతో పాటు ఆలయాన్ని కబ్జా చేసినా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

తర్లుపాడు మండలంలోని ఉమ్మారెడ్డిపల్లె, తాడివారిపల్లె, నాగెళ్లముడుపు సరిహద్దుల్లో ఉన్న అనంతరాయుడి గుడి వైకాపా నేత చెరలో చిక్కింది. నాగెళ్లముడుపు సర్వే నెంబర్‌ 156/2లోని 3.65 ఎకరాల భూమిలో అనంతరాయుడి గుడి ఉంది. స్థానికుల కొంగు బంగారంలా ఉన్న ఈ గుడిలో ఉత్సవాలు, పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఆలయ భూమిని ఓ వైకాపా యువ నాయకుడు తన బంధువుల పేరుతో నకిలీ రిజిస్ట్రేషన్‌ దస్త్రాలు సృష్టించి అంతర్జాలంలో నమోదు చేయించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని విలువ రూ.55 లక్షలుంటుందని వారంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande