అమరావతి, 12 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి 2024లో జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి ప్రభుత్వం (coalition government) సంవత్సర పాలన (Year rule)ను ముగించుకుంది. ఈ నేపథ్యంలో నేడు ఏడాది పాలనపై పోరంకిలో కూటమి ఏడాది పాలన వేడుకలు నిర్వహించనున్నారు. అలాగే సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రత్యేక కార్యక్రమం, సాయంత్రం 5 గంటలకు పోరంకిలో బహిరంగ సభ (Public meeting)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తొలి ఏడాదిలో ప్రజలకు అందించిన సుపరిపాలనపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా పాలన ప్రారంభమై నేటికి ఏడాది! సుపరిపాలనలో తొలి అడుగు పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి