లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా
హైదరాబాద్, న్యూఢిల్లీ, 12 జూన్ (హి.స.)అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 242 మంది ప్రయాణికులతోపాటు సిబ్బంది మరణించారు. అయితే ఈ విమానంలో లోపం ఉన్నట్లు ముందే ఓ
లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా


హైదరాబాద్, న్యూఢిల్లీ, 12 జూన్ (హి.స.)అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 242 మంది ప్రయాణికులతోపాటు సిబ్బంది మరణించారు. అయితే ఈ విమానంలో లోపం ఉన్నట్లు ముందే ఓ ప్రయాణికుడు సందేహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతా వేదికగా ఎయిర్ ఇండియా సంస్థకు సమాచారం అందించినట్లు తెలిపారు.

అయితే ఈ ప్రమాదానికి గురైన విమానం.. న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదగా లండన్ వెళ్లనుంది. అకాష్ అనే వ్యక్తి న్యూఢిల్లీలో ఈ విమానం ఎక్కారు. అతడు అహ్మదాబాద్‌లో దిగిపోయారు. ఆ క్రమంలో ఈ విమానంలో లోపం ఉందంటూ అతడు ముందే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆకాష్ .. తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande