అహ్మదాబాద్ విమాన.ప్రమాదం ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలిచివేసింది
అహ్మదాబాద్‌ 13 జూన్ (హి.స.) అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో కలిచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. అయితే పది నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను నిలబెట్టింది. భారీ ట్రాఫిక్‌లో ఇరుకున్న ఆమె అహ్మదాబాద్ ) విమాన ప్రమాదం
అహ్మదాబాద్ విమాన.ప్రమాదం ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలిచివేసింది


అహ్మదాబాద్‌ 13 జూన్ (హి.స.) అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో కలిచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. అయితే పది నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను నిలబెట్టింది. భారీ ట్రాఫిక్‌లో ఇరుకున్న ఆమె అహ్మదాబాద్ ) విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఆ ఘటన గురించి తలుచుకుంటుంటే తన శరీరం ఇంకా వణుకుతోందని చెబుతోంది. విమాన ప్రమాదం నుంచి తనను దేవుడే రక్షించాడని పేర్కొంది.

భూమి చౌహాన్‌ అనే యువతి అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లడానికి ఎయిరిండియా) ఫ్లైట్‌ AI171 బుక్‌ చేసుకున్నారు. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. దీంతో ఆమెకు పదినిమిషాల ఆలస్యం అయింది. అప్పటికే ఆ ఫ్లైట్‌ టేకాఫ్‌ అయి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటన గురించి భూమి చౌహన్‌ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande