జవహర్నగర్ లోని హెచ్ ఎం డి ఏ భూముల్లో.దాదాపు 330 ఎకరాలు.రక్షణ శాఖకు
అమరావతి, 14 జూన్ (హి.స.), హైదరాబాద్‌: జవహర్‌నగర్‌లోని హెచ్‌ఎండీఏ భూముల్లో దాదాపు 330 ఎకరాలు రక్షణశాఖకు బదలాయింపు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. అందుకు సంబంధించి సంప్రదింపులు దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి అటు ఎన
జవహర్నగర్ లోని హెచ్ ఎం డి ఏ భూముల్లో.దాదాపు 330 ఎకరాలు.రక్షణ శాఖకు


అమరావతి, 14 జూన్ (హి.స.), హైదరాబాద్‌: జవహర్‌నగర్‌లోని హెచ్‌ఎండీఏ భూముల్లో దాదాపు 330 ఎకరాలు రక్షణశాఖకు బదలాయింపు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. అందుకు సంబంధించి సంప్రదింపులు దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి అటు ఎన్‌హెచ్‌-44, ఇటు ఎస్‌హెచ్‌-01 వరకు రెండు ఎలివేటెడ్‌ కారిడార్లను నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్టుల్లో ప్రభుత్వ స్థలాలతోపాటు, రక్షణశాఖకు సంబంధించి భూములు, స్థలాలు అవసరమవుతున్నాయి. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్, హకీంపేట ప్రాంతంలో మొత్తం 138 ఎకరాల వరకు రక్షణశాఖకు చెందిన భూములు ఈ రెండు ప్రాజెక్టులకు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడున్న భూముల విలువకు తగ్గట్టు.. అంతే భూమిని జవహర్‌నగర్‌లో కేటాయించేందుకు హెచ్‌ఎండీఏ ముందుకొచ్చింది. ఆయా భూములను పరిశీలించిన రక్షణశాఖ అధికారులు సుముఖత వ్యక్తం చేయడంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎన్‌హెచ్‌-44 డెయిరీ ఫాం వరకు నిర్మించే కారిడార్‌కు సంబంధించి హెచ్‌ఎండీఏ టెండర్లు కేటాయించింది. భూముల బదలాయింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే రెండో ఎస్‌హెచ్‌-01 శామీర్‌పేట కారిడార్‌కు సైతం టెండర్లు పిలవనున్నారు.

596 అభ్యంతరాలు..

ఈ రెండు కారిడార్ల భూసేకరణ ఇతరత్రా పనుల నేపథ్యంలో ప్రజలు, వివిధ సంస్థల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఎస్‌హెచ్‌-1కు సంబంధించి 545, ఎన్‌హెచ్‌44కు 51 అభ్యంతరాలు నమోదుచేశారు. ఇవికాక చెట్ల తొలగింపు ఇతరత్రా

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande