అమరావతి, 14 జూన్ (హి.స.)
ఈనాడు, విశాఖపట్నం: నగరంలో ట్రాఫిక్ రద్దీ, ప్రయాణికుల అవసరాలు, భవిష్య నడిపేల ప్రాజెక్టులో కీలక నిర్ణయం విశాఖ ముఖచిత్రాన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పట్టాలెక్కిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘డబుల్ డెక్కర్’ తరహాలో నడిపేలా ఈ ప్రాజెక్టులో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే.. పైన మెట్రో రైలు... కింద వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఇందులో భాగంగా నాలుగు వరుసలతో కూడిన పైవంతెనలు నగరం నడిబొడ్డున రానున్నాయి. ఈ మార్పు కొత్తగా చోటుచేసుకోవడంతో నాలుగు వరుసల పైవంతెనలు, మెట్రో లైనుకు కలిపి సంయుక్తంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి కన్సల్టెంట్ నియామకానికి ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఆసక్తి ఉన్న సంస్థల నుంచి తాజాగా దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసియా మౌలిక వసతుల, పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ) ప్రతినిధులు రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపి.. మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డితో కలిసి విశాఖలో పర్యటించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ