అమరావతి, 13 జూన్ (హి.స)పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. డయాఫ్రంవాల్, ప్రధాన డ్యాం ఎర్త్ కం రాక్ఫిల్ డ్యాం పనుల నాణ్యాతా ప్రమాణాలపై క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర జల సంఘం సభ్యుడు యోగేందర్ పైతాంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్ఎ్స సెంగర్ శుక్రవారం రాజమహేంద్రవరానికి రానున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న పనులను వారు శనివారం సమీక్షిస్తారు. అదేరోజు రాత్రికి రాజమహేంద్రవరంలో బస చేసి అధికారులతో సమావేశమవుతారు. ఆదివారం తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ