తెలంగాణ, మెదక్. 13 జూన్ (హి.స.) మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ నగేష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు అధికారులకు పలు సూచనలు, సలహాలను చేశారు. మండల వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులో 607 దరఖాస్తులు స్వీకరించారు.నార్సింగి మండల వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సు 9 గ్రామాల్లో నిర్వహించారని, మొత్తం 607 దరఖాస్తులు వచ్చాయని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు