తెలంగాణ, ఖమ్మం. 13 జూన్ (హి.స.) ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అందిస్తుంది.. నా ఎన్నికల్లో అందరూ కష్టపడి పని చేశారు, రేపు మీ ఎన్నికలు వస్తున్నాయని, అంతా కలిసి పని చేసుకోండి అని సూచించారు. పాత పథకాలను నడిపిస్తూనే కొత్త పథకాలను అందిస్తున్నాం.. ఇంకా కొన్ని చేయాల్సి ఉంది, తప్పుకుండా చేద్దాం మంచి రోజులు వస్తున్నాయి, వర్షాలు ముందే వచ్చాయి.. నియోజకవర్గానికి సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని, చేద్దాం అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు