చిత్తూరు, 13 జూన్ (హి.స.:రాష్ట్రంలో వరుస ప్రమాదాలతో రోడ్లు నెత్తురోడుతున్నాయి. అతివేగం కారణంగా అనేక మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో) జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకు వస్తుందో ఎవ్వరూ ఊహించరు. మృత్యువు ఎలా కబలిస్తుందో ఎవరికీ తెలియదు. తాము వెళ్లే దారిలో ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే ఎవరు వెళ్తారు చెప్పండి. కానీ అది తెలీదు కాబట్టే ప్రయాణాల్లో చాలా మంది మృత్యువొడిలోకి వెళ్తుంటారు. చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన నిల్చుని ఉన్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఓ వాహనం దూసుకొచ్చింది. ఏం జరిగిందో ఊహించేలోపు పలువురు రోడ్డుపై చలనం లేకుండా పడి ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ