విజయవాడ మెట్రో రైలుకు సంబంధించి మరో కీలక మైన సి ఎంపీ కాంప్రహెన్సివ్.మొబిలిటీ ప్లాన్
అమరావతి, 14 జూన్ (హి.స.) అమరావతి: విజయవాడ మెట్రో రైలుకు సంబంధించి మరో కీలకమైన సీఎంపీ (కాంప్రిహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌) తయారీ ప్రక్రియ ముగిసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఎంఆర్‌సీ).. సలహా సంస్థ సిస్ట్రాత
విజయవాడ మెట్రో రైలుకు సంబంధించి మరో కీలక మైన సి ఎంపీ కాంప్రహెన్సివ్.మొబిలిటీ ప్లాన్


అమరావతి, 14 జూన్ (హి.స.)

అమరావతి: విజయవాడ మెట్రో రైలుకు సంబంధించి మరో కీలకమైన సీఎంపీ (కాంప్రిహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌) తయారీ ప్రక్రియ ముగిసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఎంఆర్‌సీ).. సలహా సంస్థ సిస్ట్రాతో క్షేత్రస్థాయి అధ్యయనంతో తయారు చేయించింది. రద్దీ సమయాలు, మిగిలిన వేళల్లో ఏఏ కూడళ్లలో ట్రాఫిక్‌ పరిస్థితి.. అక్కడ వెళ్లే వాహనాల సంఖ్య వివరాలతో దీనిని రూపొందించారు. ట్రాఫిక్, కుటుంబ సర్వే, భౌగోళిక పరిస్థితులు, రవాణాపరంగా మౌలిక వసతులు, డిమాండ్, జనాభా పెరుగుదల, తదితరాలను పరిగణనలోకి తీసుకుని వచ్చే 25-30 ఏళ్ల అవసరాల దృష్ట్యా సీఎంపీని సిద్ధం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande