అమరావతి, 14 జూన్ (హి.స.)
శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా రెండు రోజులు సెలవుదినాలు కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లలో భక్తులకు అల్పాహారం, మంచి నీరు చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ