ఈఈ శ్రీధర్ను కస్టడీకి కోరుతూ ఏసీబీ పిటిషన్
హైదరాబాద్, 14 జూన్ (హి.స.) ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగాలపై ఏసీబీ కేసు మేర‌కు నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నూనె శ్రీధర్ రిమాండ్‌లో ఉన్న‌ట్లు తెలిసిందే. అయితే ఈఈ శ్రీ‌ధ‌ర్‌ను క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టుల
ఏసీబీ


హైదరాబాద్, 14 జూన్ (హి.స.) ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగాలపై ఏసీబీ కేసు మేర‌కు నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నూనె శ్రీధర్ రిమాండ్‌లో ఉన్న‌ట్లు తెలిసిందే. అయితే ఈఈ శ్రీ‌ధ‌ర్‌ను క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. రూ.150 కోట్లకు పైగా శ్రీధర్ అక్రమంగా ఆస్తులను కూడబెట్టినట్లుగా ప్రాథమికంగా స‌మాచారం. అక్రమాస్తుల కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని.. వారం రోజుల పాటు శ్రీధర్ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande