హైదరాబాద్, 14 జూన్ (హి.స.)
దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలో ఉన్న ఎంబీబీఎస్ , బీడీఎస్ వంటి వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలకు గత నెల నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్- యూజీ) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం ఉదయం విడుదల చేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే తుది ఫలితాలను ఎన్టీఏ రిలీజ్ చేసింది. అభ్యర్థులకు మెయిల్స్ ద్వారా స్కోర్ కార్డులు అందుతున్నట్లు తెలుస్తోంది. నీట్ యూజీ 2025 పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్https://neet.nta.nic.in/ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..