తిరుమల, 14 జూన్ (హి.స.)తిరుమలలోని టీటీడీ ట్రస్ట్కు భారీ విరాళాలు ఇచ్చారు. విజయవాడలోని ఫార్ట్యూన్ ఫైన్ జ్యూవెలర్స్ కు చెందిన కోమటి సునీల్, వేంకటేశ్వర టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10,50,001 విరాళం అందించారు. తాడేపల్లి గూడేనికి చెందిన మాతురు పంచాక్షరి శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10,00,116 విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి