హైదరాబాద్, 15 జూన్ (హి.స.) ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ.. ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్ కు మావోయిస్టు నేతలు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల బంద్ కు ప్రజలు సహకారం అందించి.. విజయవంతం చేయాలని కోరుతూ.. మావోయిస్టు నేత జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. కాగా మావోయిస్టు నేతలు బంద్ కు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన బలగాలు.. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులతో పాటు అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను ముమ్మరం చేశారు. ఇరువైపుల వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్