తెలంగాణ, పెద్దపల్లి. 15 జూన్ (హి.స.)
జాతీయ మెగా లోక్ అదాలత్ లో
పెద్దపల్లి, మంచిర్యాల పరిధిలో 13,048 కేసులు పరిష్కరించ బడ్డాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఆదివారం కమిషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 80 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు రూ 17,66,294 అందజేశామని తెలిపారు. వివిధ పోలీసు స్టేషన్లలో నమోదై అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు విచారణలో ఉన్న IPC కేసులు 536 పరిష్కరించబడ్డాయని, ఇ-పిట్టీ కేసులు 8568 పరిష్కరం అయ్యాయన్నారు. డ్రంక్ & డ్రైవ్ కేసులు 2456 సైబర్ నేరాలకు సంబంధించి రామగుండం కమిషనరేట్ పరిధిలో 78 కేసులలో బాధితులకు రిఫండ్ 13,08,684 ఆయా అన్నారు. మొత్తం సైబర్ నేరాలకు సంబంధించి బాధితులకు మొత్తం డబ్బులు రూ.17,66,294 అందాయన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు