అమరావతి, 18 జూన్ (హి.స.)
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రికార్డు సృష్టించేలా నిర్వహించబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సమయం సమీపిస్తుండటంతో ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసినట్టు డీజీపీ చెప్పారు. ప్రధాని మోదీతోపాటు వీఐపీలు వస్తున్నందున.. భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. యోగా డే వేడుకల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు వివరించారు. 12 వందలకుపైగా సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. యోగా డే ఏర్పాట్లను కమాండ్ కంట్రోల్ రూం నుంచి డీజీపీ పరిశీలించి పలు సూచనలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ