అమరావతి, 18 జూన్ (హి.స.)
రాజమహేంద్రవరం: నగరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. బుధవారం వర్సిటీలో నిర్వహించిన యోగా సాధనలో ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా 16,123 మంది పాల్గొన్నారు. అధిక సంఖ్యలో యువతీయువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. ఈ మేరకు ప్రతినిధులు ధ్రువపత్రాన్ని వర్సిటీ అధికారులకు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ