అమరావతి, 18 జూన్ (హి.స.)
విజయనగరం అయ్యన్నపేట, ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రతి శుక్రవారం సర్వీసులు నడుపుతోంది. రాత్రి 8 గంటలకు విజయనగరంలోని డిపో నుంచి ప్రారంభమయ్యే వాహనం మరుసటిరోజు వేకువజామున 4 గంటలకు అక్కడికి చేరుతుంది. దర్శనాల అనంతరం తిరిగి అదే రోజు ఉదయం 10 గంటలకు తిరుగు పయనమై.. సాయంత్రం 5 గంటలకు ఇక్కడకు చేరుతుంది. 2 ప్లస్ 2(పుష్ బ్యాక్) సీట్లు, టీవీ సౌకర్యం ఉన్న సర్వీసులు తిరుగుతున్నాయని డిపో ప్రబంధకుడు శ్రీనివాసరావు తెలిపారు. టిక్కెట్ ధర ఒక్కొక్కరికీ రూ.1200లని, అల్పాహారం, భోజనం, టీ, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని చెప్పారు. వివరాలకు 99592 25620, 94943 31213, 94403 59596 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ