అమరావతి, 18 జూన్ (హి.స.)
పల్నాడు, జూన్ 18: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి () జిల్లా పర్యటనలో మరో అపశృతి చోటు చేసుకుంది. ఇప్పటికే జగన్ కాన్వాయ్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందగా.. ఇప్పుడు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద ఆ పార్టీకి చెందిన కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సత్తెనపల్లి కి చెందిన జయవర్దన్ రెడ్డిగా గుర్తించారు. జయవర్దన్ రెడ్డి సత్తెనపల్లిలో ఆటోమొబైల్ షాపును నిర్వహిస్తున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ