విశాఖపట్నం, 18 జూన్ (హి.స.):ఆన్లైన్, ఆఫ్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 13 మందిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారికి మ్యూల్ బ్యాంకు అకౌంట్లను సరఫరా చేస్తున్న అనకాపల్లి జిల్లా కశింకోటకు చెందిన ఒకరిని ఇటీవల అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతన్ని విచారించగా బెంగళూరులోని బిలేకహళ్లిలో డెన్ నిర్వహిస్తున్నట్టు తెలిపాడు. సాంకేతికతను వినియోగించి డెన్పై సైబర్క్రైం పోలీసులు దాడి చేసి బెట్టింగ్ నిర్వహిస్తున్న 13 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 45 సెల్ ఫోన్లు, 130 బ్యాంకు పాస్బుక్లు, 4 ల్యాప్టాప్లు, 33 ఏటీఎం కార్డులు, రెండు కౌంటింగ్ మెషీన్లను సీజ్ చేశారు. వీరంతా పలు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. పరిచయాలు పెంచుకుని మ్యూల్ అకౌంట్లను సేకరించి వారిని బెట్టింగ్ కార్యకలాపాలకు వినియోగిస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. వీరంతా బృందాలుగా ఏర్పడి.. రెడ్డి అన్నా 462, బెట్ భాయ్ బుక్ 52 పేరుతో వెబ్సైట్స్ నిర్వహిస్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ