తెలంగాణ, ఖమ్మం. 18 జూన్ (హి.స.)
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల
ప్రకారం పక్కాగా గురుకులాలను నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి అధికారులతో వివిధ పథకాలపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి సమీక్షించారు. గురుకులాల నిర్వహణ, స్టడీ సర్కిల్ పనితీరు, గ్రామీణాభివృద్ధి శాఖ, రవాణా శాఖ, విద్యుత్ శాఖ పని తీరు, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సంబంధిత అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ గురుకులాల పాఠశాలల ప్రారంభం నాటికి పిల్లలకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తులు పంపిణీ చేయాలని, దీనికి అవసరమైన నిధులు ముందుగానే విడుదల చేయడం జరిగిందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు