హైదరాబాద్, 18 జూన్ (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నేడు మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రo సీఎం ఢిల్లీకి చేరుకుంటారని, రెండు రోజుల పాటు అక్కడే పర్యటిస్తారని అధికారులు తెలిపారు. సీఎం తన పర్యటనలో భాగంగా.. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ఎంపీలతో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలోనే ఉన్న ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై.. పెట్టుబడులపై కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై వేగంగా అడుగులు వేస్తున్న క్రమంలో తెలంగాణ ఏంపీలు కేంద్ర మంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తుండటం ప్రస్తుతం కీలకంగా మారింది. అలాగే ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్