మహబూబాబాద్, 18 జూన్ (హి.స.) కాంట్రాక్టర్ చేసిన పనులకు బిల్లు చెల్లించడానికి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ అధికారి నేడు ఏసీబీ అధికారులుకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా విద్యుత్ శాఖ సీనియర్ ఇంజనీర్ (ఎస్ యి) నరేష్ ఓ పని నిమిత్తం కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు మహబూబాబాద్లోని హస్తినాపురం కాలనీలో ఎస్ యి నరేష్ లక్ష రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన అవినీతి అధికారిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..