హైదరాబాద్, 18 జూన్ (హి.స.)
వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలిచే గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. నిజమైన ముఖ్యమంత్రి అంటూ ఆకాశానికెత్తారు. తెలంగాణలో కొత్త గోశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వేల సంఖ్యలో ఆవులు, దూడలు, ఎద్దులను కబేళాల్లో అక్రమంగా చంపుతున్నారని ఆరోపించిన రాజాసింగ్.. దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మోడల్ గోశాలలు నిర్మించే నిర్ణయం చాలా మంచిదని.. గో రక్షణ కోసం ఒక ప్రత్యేక పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్