హైదరాబాద్, 18 జూన్ (హి.స.)
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రయాణికులను, ఉద్యోగులను తరలించి, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీర్య దళాలు, డాగ్ స్క్వాడ్లు విమానాశ్రయం మొత్తం గాలించాయి. అయితే, ఎటువంటి బాంబు లేదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, మెయిల్ పంపిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్