అమరావతి, 18 జూన్ (హి.స.)
అమరావతి: పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు) స్పష్టం చేశారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలని సీఎం ఆదేశించారు.
మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరతో పాటు వివిధ అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డీ బర్లి పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇందులో 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ కేజీల పొగాకును ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ