పల్నాడు జిల్లా సత్తెన పల్లి మండలం రెంటపాళ్ళలో మాజీబ్సి.జగన్.పర్యటన
పల్నాడు జిల్లా , 18 జూన్ (హిస)సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మాజీ సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో 25 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రెంటపాళ్లతో పాటు నందిగామ అడ్డరోడ్డు, సత్తెనపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. రెంటపాళ్ల వైకాపా నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరా
పల్నాడు జిల్లా సత్తెన పల్లి మండలం రెంటపాళ్ళలో మాజీబ్సి.జగన్.పర్యటన


పల్నాడు జిల్లా , 18 జూన్ (హిస)సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మాజీ సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో 25 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రెంటపాళ్లతో పాటు నందిగామ అడ్డరోడ్డు, సత్తెనపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. రెంటపాళ్ల వైకాపా నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జగన్‌ పాల్గొననున్నారు. ఈ పర్యటనకు ఆయన కాన్వాయ్‌తో పాటు మూడు వాహనాలు, 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. వైకాపా పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తుండటంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. అనుమతికి మించి వైకాపా శ్రేణులు పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరోవైపు నందిగామ అడ్డరోడ్డు వద్ద ‘గ్యోబ్యాక్‌ జగన్‌’, ‘అమరావతి ద్రోహి జగన్‌’ అంటూ ఫ్లెక్సీలు కనిపించాయి. బుధవారం తెల్లవారేసరికి పోలీసులు వాటిని తొలగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande