దిల్లీ, 18 జూన్ (హి.స.) పుణె వెళ్తున్న ఎయిరిండియా విమానం మూడు గంటలకు పైగా ఆలస్యం కావడంపై ఎంపీ సుప్రియా సూలే అసహనం వ్యక్తంచేశారు. ప్రయాణికులకు కనీసం సమాచారం ఇవ్వలేదని తప్పుబట్టారు. ఆమె పోస్ట్పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు.
‘‘దిల్లీ నుంచి పుణె వెళ్తున్న ఎయిరిండియా విమానం AI 2971లో నేను ప్రయాణించాల్సి ఉంది. విమానం మూడు గంటలకు పైగా ఆలస్యమయింది. దీనిపై ప్రయాణికులకు ఎటువంటి సమాచారం లేదు. ఇలాంటి ఆలస్యాలు, సేవా లోపాలు ఎయిరిండియాలో సర్వసాధారణంగా మారాయి’’ అని ఆమె ఎక్స్లో పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును, టాటా గ్రూప్ను ఆమె ట్యాగ్ చేశారు. ప్రయాణిలకు మెరుగైన సేవలందేలా చూడాలని పోస్ట్ చేశారు.
దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. సంబంధిత విమాన సంస్థతో పాటు విమానాశ్రయ అధికారులతో స్వయంగా మాట్లాడానన్నారు. ప్రయాణికులకు తగిన సాయం అందించాలని సూచించినట్లు ఎక్స్ వేదికగా బదులిచ్చారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు