కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం.. ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల
తెలంగాణ, మెట్పల్లి. 18 జూన్ (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ అధోగతి పాలైందని, సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రానికి పెట్టుబడులు నిలిచిపోయాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యా
ఎమ్మెల్యే సంజయ్ఎమ్మెల్యే సంజయ్


తెలంగాణ, మెట్పల్లి. 18 జూన్ (హి.స.)

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ అధోగతి పాలైందని, సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రానికి పెట్టుబడులు నిలిచిపోయాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ, పరిసర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనతో రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిన తెలంగాణ ప్రస్తుతం ఆదాయ మార్గాలు లేక పాలన కుంటుపడిపోయిందన్నారు. స్థానిక సంస్థల్లో లబ్ధికోసమే రైతు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. రెండుసార్లు రైతులకు రైతు బంధు ఎగ్గొట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని ఎద్దేవా చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande