హైదరాబాద్, 18 జూన్ (హి.స.)
కాళేశ్వరం ప్రాజెక్ట్ కేబినెట్ ఆమోదంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాంధీ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. గతంలో నేను కేబినెట్ లో ఉన్నప్పుడు కాళేశ్వరం ఫైనల్ నివేదిక రాలేదని స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్ట్ లు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ల పైనే సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ కేవలం రికమండేషన్స్ చేస్తుంది అంతేనన్నారు. ప్రాణహితతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ వేశారు మేడిగడ్డ శాంక్షన్ కేబినెట్ ముందుకు కానీ, సబ్ కమిటి ముందుకు రాలేదు. కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ అసత్యాలు మాట్లాడారంటూ కౌంటర్ ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్