హైదరాబాద్, 18 జూన్ (హి.స.)
రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనులు అండ్ భూగర్భ శాఖా మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం బాధ్యతలు స్వీకరిచారు. సెక్రటేరియట్ లోని సెకండ్ ఫ్లోర్ లో తనకు కేటాయించిన చాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యాలయంలోకి అడుగు పెట్టారు. అంతకు ముందు తన చాంబర్ కు వచ్చిన మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంబంధింత శాఖల అధికారులు, నాయకులు వివేక్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఏటీసీ ఫైల్పై తొలి సంతకం…మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ల (ఏటీసీ) పై వివేక్ తొలి సంతకం చేశారు. రూ. 2600 కోట్ల నిధులకు సంబధించిన ఫైల్ పై ఆయన సంతకం చేశారు. కాగా రాష్ట్రంలోని ఐటీఐలన్నింటిని ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే నిర్ణయించారు. ఐటీఐలు లేని చోట ఏటీసీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్