కర్నూలు, 18 జూన్ (హి.స.)పాలు, ఎండు ద్రాక్ష రెండు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి, రోగ నిరోధక శక్తి, జీర్ణక్రియకు మద్దతు ఇచ్చే పోషకాలు అందుతాయి. ముఖ్యంగా నీటిలో కాకుండా పాలలో ద్రాక్షను నానబెట్టి తీసుకుంటే దీని ప్రభావం మరింత పెరుగుతుంది. ఎండు ద్రాక్షలో ఉండే ఐరన్ శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. దాన్ని పాలలో నానబెట్టి తింటే ఐరన్ ఒంటపట్టడం మరింత మెరుగుపడుతుంది. రక్తహీనత (అనీమియా) సమస్య ఉన్నవాళ్లకు ఇది ఒక సహజ మార్గం.
పాలలో కాల్షియం ఉంటే ఎండు ద్రాక్షలో బోరాన్ అనే ఖనిజం ఉంటుంది. ఈ రెండింటి కలయిక ఎముకలకు అవసరమైన బలాన్ని ఇస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనతను ఇది తగ్గించే అవకాశం ఉంది.
నానబెట్టిన ఎండు ద్రాక్షలో ఉండే ఫైబర్ పేగులు చక్కగా పని చేసేలా చేస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. పాలలో కలిపి తీసుకోవడం వల్ల ఆమ్ల స్థాయులు నియంత్రితంగా ఉండి, జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి