తెలంగాణ, నిజామాబాద్. 18 జూన్ (హి.స.)
శరీరానికి ఉన్న అంగ వైకల్యాన్ని మనో సంకల్పంతో జయించి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం నగరం లో నిర్వహించిన వికలాంగుల బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. వికలాంగుల బడిబాట కార్యక్రమంతో అంగవైకల్యం ఉన్న విద్యార్థుల్లో, తల్లితండ్రుల్లో మనో శక్తి పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్నేహ సొసైటీ వారిని అభినందించారు. విద్య ఒక్కటే విద్యార్థుల జీవితాలను తీర్చి దిద్దుతుందన్నారు. విద్యతో పాటు వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను సాధించిన సుధా చంద్రన్, లూయి బ్రెయిల్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు