హైదరాబాద్, 18 జూన్ (హి.స.)
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో జరిగే సదస్సులో పాల్గొననున్నారు. 'ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్ మెంట్ ఇన్ ఇండియా' అనే అంశంపై తెలంగాణ అభివృద్ధి కోసం అనుసరించిన విధానాల గురించి ప్రసంగిస్తారు.
కేటీఆర్ బుధవారం రాత్రి బయలుదేరి తిరిగి ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ చేరుకుంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..