రంగారెడ్డి, 18 జూన్ (హి.స.)
రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్
స్టేషన్ పరిధిలోని పులిమామిడి గ్రామంలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పసుపుల జంగయ్యను (58) అతని సొంత కుమారుడు శేఖర్ బండరాయితో తలపై కొట్టి చంపాడు.
తమకు ఉన్న అర ఎకరా భూమి విషయoలో గత కొంతకాలంగా తండ్రీ కొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భూమి అమ్మడానికి తండ్రి అడ్డు వస్తున్నాడని శేఖర్ తన తండ్రి జంగయ్యను చంపేశాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.కొడుకు శేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..