సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీసు స్టేషన్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 18 జూన్ (హి.స.) మాజీ ఎంపీటీసీ కుంటయ్య కుటుంబానికి అన్ని రకాల అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసానిచ్చారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకు
కేటీఆర్


తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 18 జూన్ (హి.స.)

మాజీ ఎంపీటీసీ కుంటయ్య కుటుంబానికి అన్ని రకాల అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసానిచ్చారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కుంటయ్య పార్థివదేహానికి కేటీఆర్ నివాళులర్పించారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఏసీబీ విచారణకు వెళ్తున్న తనకు ధైర్యం చెప్పి కుంటయ్య ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుంటయ్య ఇద్దరు పిల్లల చదువు, పెళ్లిళ్ల పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. పోలీసు స్టేషన్ లు సెటిల్మెంట్ లకు అడ్డాగా మారాయని, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన విధంగా పోలీసులు నడుచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుంటయ్య ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా తిరిగి తనపైనే కేసు పెట్టడం అమానుషమని, కుంటయ్యకు జరిగిన అన్యాయం పై న్యాయపోరాటం చేస్తామన్నారు. సివిల్ మ్యాటర్ లలో పోలీసులు దూరటం మంచిది కాదని ప్రభుత్వానికి సూచన చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande