మెదక్. 18 జూన్ (హి.స.)
బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామాయంపేట పట్టణానికి చెందిన దేవుని రాజేందర్ (28) మంగళవారం రాత్రి ప్రగతి ధర్మారం వైపు బైక్ పై వెళుతున్నాడు. ఈ క్రమంలోనే కోమటిపల్లి శివారులో బైక్ అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొన్నాడు. దీంతో రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..