హైదరాబాద్, 18 జూన్ (హి.స.) పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)లు నేటి నుంచి ప్రారంభమయ్యాయి 30 వరకు నిర్వహించనున్న టెట్ పరీక్షకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని టీజీ టెట్ చైైర్పర్సన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. నిర్ణీత తేదీల్లో ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు సెషన్- 1; మరియు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి.
జూన్ 18, 19, 24 (మొదటి షిఫ్టు), 28, 29, 30 తేదీల్లో పేపర్ -2 పరీక్షలు జరగనుండగా.. జూన్ 20, 23, 24 (రెండో షిఫ్టు), 27 తేదీల్లో పేపర్ -1 పరీక్షలు నిర్వహిస్తారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్