అమరావతి, 18 జూన్ (హి.స.)
గుంటూరు, వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఏటూకురులో వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్.. ఒక వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ