ఢిల్లీ , 18 జూన్ (హి.స.) ఏపీ మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన... ఈరోజు, రేపు అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తన పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వీరు చర్చించారు. ఈ సందర్భంగా లోకేశ్ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీశ్, బైరెడ్డి శబరి ఉన్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్, సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో లోకేశ్ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి