సిద్దిపేట జిల్లాలో విషాద‌ ఘటన.. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య..
సిద్దిపేట, 18 జూన్ (హి.స.) అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ యువ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తీగుళ్ల రాజు (35) అనే యువ కౌలు రైతు గత క
రైతు ఆత్మహత్య


సిద్దిపేట, 18 జూన్ (హి.స.)

అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ యువ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తీగుళ్ల రాజు (35) అనే యువ కౌలు రైతు గత కొన్నేళ్లుగా పక్క గ్రామం దౌలాపూర్ లో 3 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా రాజు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద పెట్టుబడుల కోసం, కుటుంబ పోషణ నిమిత్తం సుమారు రెండు లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం కనిపించక మనోవేదనతో ఇటీవల పక్షవాతానికి గురయ్యాడు. చేసిన అప్పులు, తీర్చే మార్గం లేక సతమవుతున్న రాజును అనారోగ్యం మరింత కలిచివేసింది. దీంతో మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకుల సహాయంతో స్థానికులు మొదట గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి, తరువాత హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజు రాత్రి 12 గంటలకు మృతి చెందాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande