తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 19 జూన్ (హి.స.)
పర్యావరణ హితంగా మట్టి
ఇటుకలు తయారు చేయండి, ఆరోగ్యాన్ని పొందండి, బహుమతులు గెలుచుకోండి అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సండే బ్రిక్స్ చాలెంజ్” పేరుతో జిల్లా యంత్రాంగం వినూత్నంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల 22 న ఆదివారం, ప్రగతి మైదానం, కొత్తగూడెంలో ఉదయం 6:00 నుంచి 9:00 వరకు జరిగే ఈ ఓపెన్ ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని కలెక్టర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు