' రైతు భరోసా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి 'మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ, రంగారెడ్డి. 19 జూన్ (హి.స.) రైతు భరోసా పథకాన్ని రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజవర్గాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బిఆర్ఎ
సబితా ఇంద్రారెడ్డి


తెలంగాణ, రంగారెడ్డి. 19 జూన్ (హి.స.)

రైతు భరోసా పథకాన్ని రంగారెడ్డి

జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజవర్గాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బిఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని తొమ్మిది మండలాల్లో రైతు బంధు ఇవ్వడంలేదని, జిల్లాలోని అన్ని మండలాలకు రైతు భరోసా ఇవ్వాలంటూ అలాగే రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ కు అనుకోని ఉన్న మండలాల్లో రైతులకు రైతు భరోసా ఇవ్వాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande