తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 19 జూన్ (హి.స.)
ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై అరణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్టులు మొగ్గు చూపుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.
వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 12 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఇందులో తొమ్మిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరితోపాటు 12 ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు 81 & 141 సీఆర్పిఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసి ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై మావోయిజాన్ని వీడీ జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్టులు మొగ్గు చూపెడుతున్నారని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు