పోడు భూముల్లో సర్వే.. అటవీ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు.
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 19 జూన్ (హి.స.) రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం రంగంపేటలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాము ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేస్తున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేయడంపై గ్రామస్తులు
అటవీ అధికారులు


తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 19 జూన్ (హి.స.) రాజన్న సిరిసిల్ల జిల్లాలోని

వీర్నపల్లి మండలం రంగంపేటలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాము ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేస్తున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేయడంపై గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టాలు లేని పోడు భూముల్లో రెండోరోజు సర్వే చేయడానికి ఎఫ్ఎస్వో పద్మలత, బేస్ క్యాంపు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు, పోడు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు. తము సాగు చేసుకుంటున్న భూముల్లోకి అధికారులను వెళ్ళనీయకుండా రోడ్డుపై బైఠాయించారు. సుమారు 30 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న తమ భూములను లాక్కొని ఫ్లాంటేషన్ చేస్తే ఊరుకోబోమని వారు హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande