తిరుమల, 19 జూన్ (హి.స.)దక్షిణ భారతదేశంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) ఒకటి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే వేసవి సెలవులు ముగిసే క్రమంలో గత నెల రోజులుగా తిరుమల కొండపై భక్తుల రద్దీ (Crowd of devotees) విపరీతంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్కూళ్లు ప్రారంభమైనప్పటికి భక్తుల రద్ధీ తగ్గడం లేదు.
తాజాగా ఈ రోజు ఉదయం కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
గురువారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో.. కొండపై ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి.. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి