యోగాంధ్రలో భాగంగా విశాఖలో వాకథాన్
విశాఖపట్నం, 19 జూన్ (హి.స.)యోగాంధ్రలో భాగంగా విశాఖపట్నంలో ఈ ఉదయం వాకథాన్, యోగాభ్యసన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు సత్య కుమార్ యాదవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, డీవీబీ స్వామి, సవితతో కలసి ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ నుంచి మహంకాళి టెంపుల్ వరక
యోగాంధ్రలో భాగంగా విశాఖలో వాకథాన్


విశాఖపట్నం, 19 జూన్ (హి.స.)యోగాంధ్రలో భాగంగా విశాఖపట్నంలో ఈ ఉదయం వాకథాన్, యోగాభ్యసన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు సత్య కుమార్ యాదవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, డీవీబీ స్వామి, సవితతో కలసి ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ నుంచి మహంకాళి టెంపుల్ వరకు వాకథాన్ నిర్వహించారు. యోగాపై ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ఉత్సాహంగా సాగింది.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ యోగా కేవలం వ్యాయామం కాదు. జీవన విధానం అన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు, ఆధ్యాత్మిక భావన పెంచే సాధనం. అందువల్ల ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనబోయే కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande